40.2 C
Hyderabad
April 29, 2024 15: 16 PM
Slider హైదరాబాద్

వీరభద్రీయులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

#etala

సమాజంలో సంచార జాతులుగా ఉన్న వీరభద్రీయులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, వాటా కోసం అవసరమైతే ఉద్యమం నిర్మిద్దామని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. 50 సంవత్సరాల తరువాత  ప్రజాస్వామ్యయుతంగా వారి కోరికను నెరవేర్చేలా రాజకీయ అవకాశాలను ముఖ్యమంత్రి కెసిఆర్ కల్పించాలని కోరారు. సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణా వీర భద్రీయ (వీర ముష్టి) సంఘం కేంద్ర కమిటీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో వీరభద్రీయులకు  చైర్మన్లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష లేకుండా సీట్లు కేటాయించాలని, ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పోర్తి చేసేందుకు ఇవ్వనది కాబట్టి నేరుగా ప్రవేశాలు కల్పించాలని  డిమాండ్ చేశారు. అన్ని కులాలకు ఇస్తున్నట్లు వీరికి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని అన్నారు.  వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వెన్నంటి ఉంటామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ స్వర్ణోత్సవాల్లో జాతీయ  వీర భద్రీయ (వీర ముష్టి) సంఘం అధ్యక్షులు కోటపల్లి రాజేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మండలాలు, జిల్లాలో సంఘం భావనాల కోసం 10 గుంతల స్థలం కేటాయించి నిర్మించాలన్నారు. అన్ని మండలాల్లో వీర భద్రీయ పేరుతో ధృ వీకరణ పత్రాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సాంస్కృతిక కళాకారులకు ప్రత్యేక సంగీత అకాడమీ ఏర్పాటు చేయాలని, కళాకారుల కోసం పింఛన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కోయినా పల్లి గ్రామా సర్పంచ్ మిట్టపల్లి వసంత ఋషి , ఉప సర్పంచ్ ఎం. ఎల్లేష్, తెలంగాణా వీర భద్రీయ (వీర ముష్టి) సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు కోటపల్లి వీరా స్వామి, ప్రధాన కార్యదర్శి చెవ్వ కొండయ్య, కేంద్ర కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు మిట్టపల్లి పోచయ్య, కోశాధికారి కాటపల్లి రవికుమార్, కేంద్ర కమిటీ కార్యదర్శి కడెం జంగయ్య, జాతీయ కమిటీ కార్యదర్శి పొన్నాల శివరాజ్, జాతీయ కమిటీ కోశాధికారి కాటపల్లి గండి స్వామి,  వీర భద్రీయ (వీర ముష్టి) చారిటబుల్ ట్రస్ట్ వైస్  చైర్మన్ చెవ్వ విజయచందర్, ప్రధాన కార్యదర్శి చెవ్వ శ్రీనివాస్, కార్యదర్శి కాటపల్లి ఎల్లేష్, కోశాధికారి కాటపల్లి  శ్రీశైలం, విద్యా  కమిటీ చైర్మన్ కాటపల్లి  విఠల్, జిల్లా అధ్యక్షులు కడెం కోటయ్య (మహబూబ్ నగర్), మిట్టపల్లి జనార్దన్ (కామారెడ్డి), అగుళ్ల శంకర్ (సిద్ధిపేట), నారాయణపేట (సారంగి భీమేష్) తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రమశిక్షణకు మారుపేరు గురుకులాలు

Satyam NEWS

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవం

Satyam NEWS

‌కిడ్నాప్ కేసు ఐదు గంటల్లో ఛేధించిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment