27.7 C
Hyderabad
May 4, 2024 08: 32 AM
Slider నిజామాబాద్

భూ బకాసురులు వస్తున్నారు జాగ్రత్త

#katipalli

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శ

కామారెడ్డిలో దోచుకోవడానికి భూ బకాసురులు వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి, బిక్కనూర్ మండలాల్లో ఎన్నికల ప్రచారంలో రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ రెడ్డి కామారెడ్డి నుండి ఎందుకు పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములపై కన్నేసిన భూ భకాసులు వస్తున్నారనీ , ఓటు వేసే ముందు మన భూములను గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు కామారెడ్డి అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రజల వెంటే ఉన్న తనను గెలిపిస్తే ఎల్లవేళలా కామారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యేలు అమ్ముడుపొరని గ్యారెంటీ ఇవ్వగలరా..?

రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలు కాదని, కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపొరని గ్యారెంటీ ఇవ్వగలరా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ కి ఓటు వేసినా బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టేనన్నారు. అవినీతి రహిత, సుస్థిర పాలన కోసం కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగి వేశారారని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

లాల్ బాగ్ శివాలయంలో మహా శివరాత్రి ఏర్పాట్లు

Satyam NEWS

బిచ్చుంద మండలంలో రంజాన్ కానుకలు పంపిణీ

Satyam NEWS

జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ

Bhavani

Leave a Comment