మహాశివరాత్రి పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ లోని లాల్ బాగ్ శివాలయంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఎంతో మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మహాశివరాత్రి పండుగ రోజున ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోనేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ కార్మికులు, గ్యాంగ్ వర్క్స్ తో పనులను చేయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంబర్పేట్ నియోజకవర్గం దూసరి శ్రీనివాస్ గౌడ్, దేవాలయం సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట