38.2 C
Hyderabad
May 3, 2024 21: 20 PM
Slider ప్రత్యేకం

దేశంలో ఎన్నో పార్టీలున్నయ్….మరి బీజేపీయే ఎందుకంటే……?

నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు వెనుకాడని పార్టీ బీజేపీ మాత్రమే-పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు

ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయయని. మరి బీజేపీ మాత్రమే ఎందుకు కావాలని.. ఎందుకంటే… నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు వెనుకాడని ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

అధికారం కంటే సిద్ధాంతమే ముఖ్యమని నమ్మి ఆచరిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రపంచానికి భారతీయ జీవన గమనమే ఉత్తమ మార్గమని చాటి చెబుతూ భారత్ ను విశ్వగురుగా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. అందుకే ఈ దేశానికి బీజేపీ మాత్రమే శ్రీరామరక్ష’’ అని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా కార్యకర్తల త్యాగాల పునాదులపై నిలదొక్కుకున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.

కార్యకర్తల త్యాగాల స్పూర్తితో తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించి గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ అవినీతి-కుటుంబ-నియంత పాలనను ఎండగట్టేందుకు బీజేపీ కార్యకర్తలంతా గడపగడపకూ వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాస్, బంగారు శ్రుతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శి ఉమారాణి, బొమ్మ జయశ్రీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….

ఈ దేశంలో ఎన్నో పార్టీలున్నయ్. బీజేపీయే ఎందుకు? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం మనం చేస్తున్న పనే. అన్ని పార్టీల్లాగా అధికారం లక్ష్యమైతే బీజేపీ ఎందుకు? కాంగ్రెస్, టీఆర్ఎస్ చాలు కదా… భారత్ ను విశ్వగురుగా నిలబెట్టాలనే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తూ ప్రపంచంలోని హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. ఇంత గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని బండి సంజయ్ అన్నారు.

ఈ రోజు నాకు పార్టీ స్థాపించిన నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980 ఏప్రిల్ 6న ఆ మహనీయుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ముంబైలో చీకటి నిండిన హాలులో భారతీయ జనతా పార్టీని స్థాపిస్తూ ‘చీకట్లు చీలిపోతాయి.. సూర్యుడు ఉదయిస్తాడు.. మన కమలం వికసిస్తుంది..’ అని అన్న మాటలు నా చెవుల్లో రింగుమంటున్నాయని గతాన్ని గుర్తు చేసారు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.ఆనాడు అటల్ జీ చెప్పిన మాటలను దేశం నిజం చేసిందని పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండంటే రెండే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా…. వాజ్ పేయి, అద్వానీ సహా ఆనాడు ఎందరో మహనీయులు చేసిన క్రుషి, త్యాగాల ఫలితంగా ఈనాడు 303 ఎంపీ సీట్లతో తిరుగులేని శక్తిగా పార్టీ ఎదిగిందన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన రథయాత్రతో దేశవ్యాప్తంగా హిందువుల ఐక్యత ఎంత అవసరమో దేశానికి చెప్పిన పార్టీ నా బీజేపీ యేనని బండి సంజయ్ అన్నారు.1999లో ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి అటల్ జీ ఆధ్వర్యంలో ఐదేళ్ల పాటు కొనసాగిందని ఆ తరువాత 2014లో మరో నవశకం మొదలైందని 282 ఎంపీ స్థానాలను గెలిచి పీఎం మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు చరమ గీతం పాడారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నారు.

కానీ బీజేపీ తను నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేసేందుకు ఏనాడూ వెనుకాడలేదు. దేశం ఫస్ట్… పార్టీ నెక్ట్స్… వ్యక్తి లాస్ట్ అనే గొప్ప సిద్ధాంతమే బీజేపీ బలం. ఈ దేశం కోసం.. నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన నాయకులు శ్యామా ప్రసాద ముఖర్జీ.. వారి త్యాగాల ఫలితంగా ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. దాదాపు 20 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ ఏనాడూ అధికారంలో లేదని అయినా సిద్ధాంతాల కోసం నిరంతరం కొట్లాడుతూ ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొంటూ నిలిచిన ఏకైక పార్టీ బీజేపీ అని కరీంనగర్ ఎంపీ అన్నారు.
మరి తెలంగాణలో పరిస్థితి ఏంటని.. తెలంగాణలో పార్టీని బతికించడానికి, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎందరో నాయకులు, కార్యకర్తలు తమ జీవితాలను ధారపోశారని బండి సంజయ్ గుర్తు చేశారు.

కార్యకర్తల స్పూర్తితో టీఆర్ఎస్ గద్దె దించడానికి ఇదే మన ఆఖరి పోరాటం కావాలని ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను మోసం చేస్తుండని ఆరోపించారు. వీటిపై చర్చ జరగకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని బదనాం చేస్తూ కేసీఆర్ చేస్తున్న డ్రామాలు చేస్తూ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.వాస్తవ విషయాలను ప్రజలకు వివరిద్ధామన్నారు. టీఆర్ఎస్ కుటుంబ-అవినీతి-నియంత పాలనపై చైతన్యం కలిగిద్దాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండాను గొల్లకొండ కోటపై ఎగరేద్దామన్నారు. ఆ సన్నివేశాన్ని మనందరం చూసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

Related posts

ఆదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి

Bhavani

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

Satyam NEWS

నారాయణ…. నారాయణ… కాషాయ కమ్యూనిస్టు

Satyam NEWS

Leave a Comment