నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న తమ ప్రభుత్వం ను ప్రజలు ఆదరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో నాబార్డ్ నిధులు రూ31.58 లక్షలతో నిర్మించనున్న కొండాయి గూడెం సహకార సంఘం గోదాం కార్యాలయం భవన నిర్మాణానికి ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లనే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను దేశానికి వివిధ రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తుంటే అవి రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కనిపించకపోవడం విచారకరమని అన్నారు
తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అర్థం పర్థం లేని విమర్శలుచేస్తున్నాయని వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డి సి సి బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తన అభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సర్పంచ్ మూడు దుర్గ జ్యోతి, ఎంపీపీ బానోత్ సునీత రామదాస్ ,జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, కొండాయి గూడెం ,కామేపల్లి సొసైటీ చైర్మన్ లు హనుమంతరావు , చిదంబర రావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు అచ్చయ్య, పలువురు ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.