29.7 C
Hyderabad
April 29, 2024 09: 50 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’

#prajasangrama yatra

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 24 నుండి చేపట్టనున్న పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా నామకరణం చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ పేరును బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ అధికారికంగా ప్రకటించారు.

అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నియంతృ త్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఈనెల 24నుండి చేపట్టబోయే ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు రాష్ట్రం నలుమూలల నుండి  ప్రతి ఒక్క కార్యకర్త హాజరవుతారని చెప్పారు. 

పార్టీ అధ్యక్షుడుబండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేస్తామని, కనీవినీ ఎరగని రీతిలో పాదయాత్రకు భారీ ఎత్తున కార్యకర్తలు, జనం తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.పాతబస్తీని కేసీఆర్ ఎంఐఎం నేతలకు తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అధికారం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ సిగ్గు లేకుండా సంతల్లో పశువుల్లా కొంటున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్దికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా కేసీఆర్ మాత్రం  అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే దళిత బంధు పేరిట హుజూరాబాద్ లో వందల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెడుతున్నారని చెప్పారు.తన నియోజకవర్గంసహా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, పేదలు ఉన్నారని వారికోసం ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదని ప్రశ్నించారు.

తన నియోజకవర్గ ప్రజలకు వందల కోట్ల రూపాయల దళిత బంధు నిధులు వస్తాయంటే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజాసింగ్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తోపాటు పాదయాత్ర కమిటీ ప్రముఖ్, పార్టీ రాష్ట్ర ఉఫాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి జయశ్రీ, ఎస్పీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేతేపల్లిలో  ఏటీఎం ఏర్పాటు చేయాలి

Satyam NEWS

తిరుమ‌ల‌లో తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం ఏర్పాటు

Satyam NEWS

జోహార్:రత్న ప్రభాకర్ రెడ్డికి మాచినేని పల్లిలో ఎమ్మెల్యే నివాళి

Satyam NEWS

Leave a Comment