శ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కుటుంబ సభ్యులు పీఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి,వారి కుమారులు ఎన్.గోవింద స్వామి, ఎన్.వరదరాజ స్వామి గురువారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ను మర్యాదపూర్వకంగా కలిశారు.
భేటీ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి చివరి వీలునామా ప్రకారమే పీఠాధిపతి నియామకం జరగాల్సి ఉండగా అధికార,అనధికార శక్తులు గోవింద స్వామి నియామకాన్ని అడ్డుకున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అంతిమంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవించడం తప్పనిసరి అని తెలిపారు.
పీఠాధిపతి గా ఎన్.గోవిందస్వామి ని నియమించే అవకాశం ఉందని,హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని ధార్మిక పరిషత్ కు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అందజేసి గోవింద స్వామికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని అన్నారు.
న్యాయం కోసం పోరాడుతున్న దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి కి నవతరం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రావు సుబ్రహ్మణ్యం ను కలిసిన వారిలో డాక్టర్ కలాం ఐ.ఏ.ఎస్ అకాడమీ ఛైర్మన్ పాలెపు శ్రీనివాస్, తుర్లపాటి సాంబశివరావు, తుర్లపాటి నగేష్, విప్పర్ల శ్రీనివాస్ ఉన్నారు.