జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం,జాతీయ క్షయ నిర్మూలనా కార్యక్రమం గూర్చి ప్రజల అవగాహనకై పి హెచ్ సి లింగగిరి హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ రూపొందించిన కరపత్రాలను హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ అవగాహన తోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, పరిసరాల పారిశుధ్యం,ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా,పరిశుభ్రమైన నీటిని కాచి చల్లార్చి త్రాగడం ద్వారా సీజనల్ వ్యాధులు మన దరి చేరకుండా కాపాడుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య సిబ్బంది ఉదయగిరి శ్రీనివాస్,బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్