26.7 C
Hyderabad
May 16, 2024 08: 14 AM
Slider కృష్ణ

బ్రదర్ అనిల్ కుమార్ సభలను విజయవంతం చేయండి

#Anil Kumar

ఆధ్యాత్మిక బోధనలే మానవుని జీవితానికి ప్రశాంతతను ఇస్తాయని,అంతర్జాతీయ ప్రసంగీకులు బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొనే సభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. గుడివాడ శోభన హోటల్ నందు మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన సమావేశంలో రెవ.డా.నేలపాటి సామ్యేలు అధ్యక్షత వహించగా,అనిల్ వరల్డ్ ఇవాంజలిజం మీటింగ్స్ కోఆర్డినేటర్ బ్రదర్.పి.సామ్యూల్ విచ్చేసి జనవరి 15, 16, 17 తేదీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే యేసుక్రీస్తు ఆశీర్వాద పండగలలో అంతర్జాతీయ ప్రసంగీకులు బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొని ఆధ్యాత్మిక దైవ సందేశాలను ఇస్తారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని,దైవ సేవకులు,సంఘాలు కలిసి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో దైవ సేవకులు కేజే విక్టర్ పాల్ ఈ పని గొప్పది అనే అంశంపై వాక్య సందేశాన్ని అందించారు. బిషప్‌. డా.అప్పికట్ల జాషువా గ్రీటింగ్స్ తెలిపారు.ఈ సమావేశంలో గుడివాడ స్థానిక కన్వీనర్స్ రెవ.బి. ప్రభాకర్ రెడ్డి,రెవ.డా‌. నేలపాటి సామ్యూల్, రెవ.ఈదా డేవిడ్ రాజు,రెవ.డా. కేజే విక్టర్ పాల్,రెవ.జి. శ్యాంబాబు,ప్రార్థనలు చేసి గోడ పత్రికలను మరియు కరపత్రాలను రిలీజ్ చేశారు‌.ఈ కార్యక్రమంలో 17 మండలాల సేవకులు, ప్రతినిధుల పాల్గొనగా,ఈ సమావేశంలో రెవ.కె.ఎలైజ,రెవ.మందా సువర్ణబాబు,రెవ.జడ జానన్న, రెవ‌.జాషువా జ్యోతి అనేకమంది దైవ సేవకులు పాల్గొన్నారు.

Related posts

మద్యం అక్రమంగా తరలిస్తున్న బిజెపి నాయకుడు

Satyam NEWS

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముందస్తు అరెస్ట్

Satyam NEWS

ప్రపంచ రికార్డు కోసం మహిషాసుర మర్ధని స్తోత్ర గానం

Satyam NEWS

Leave a Comment