ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది ఏక కంఠం తో ఉచ్చరించే అయిగిరినందిని అనే మహిషాసుర మర్ధని స్తోత్రం మహాద్భుత ఈవెంట్ కి విజయనగరం వేదిక అయింది. రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ రోటరీ డి. ఎన్. ఆర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రపంచ రికార్డుల కోసం అంతర్జాతీయ శాస్త్రీయ సంగీత కళాకారుల నృత్య కళాకారుల సంఘం (ఐ.సి.యం.డి.ఎ) నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ పద్మప్రియ కోర్దినటర్ గా వ్యవహరించారు. మొత్తం విజయనగరం జిల్లా నలువైపులా సంగీత కళాకారులు ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ మృదంగ విద్వాంసుడు ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక రవి ఈ ప్రపంచ రికార్డ్ ప్రయత్నాన్ని పర్యవేక్షించారు. అధ్యక్షుడు ఉసిరికల చంద్రశేఖర్ రావు, కోశాధికారి గుండ వీరభద్రరావు, సభ్యులు నానాజీ, మేఘరాజ్ రాఠీ, దూసి శివరాం శర్మ, ఇంకా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.