ఏపీ రాష్ట్ర సీఎం జగన్..ఈ నెల 14న విజయనగరం -విశాఖ ల మధ్య ఉన్న రఘు ఇంజనీరింగ్ కాలేజీ కి వస్తున్నారు.అదే రోజు నెల్లిమర్ల ఎమ్మెల్యే కొడుకు పెళ్లి కై ప్రత్యేకంగా గుంటూరు జిల్లా మంగళగిరి నుంచీ బయలుదేరనున్నారు.ఈ మేరకు జీఏడీ…సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ను తెలియజేసింది.ఈ నెల 14న మంగళగిరి నుంచీ గన్నవరం ఏర్ పోర్ట్ కు వచ్చి..
అక్కడ ప్రత్యేక విమానంలో విశాఖ ఏర్ పోర్ట్ కు మధ్యాహ్నం 02.30కు చేరుకుంటారు. అక్కడే ప్రత్యేకంగా సిద్ధం చేసిన హెలికాప్టర్ ద్వారా భీమిలి మండలం రఘు కాలేజీ ఎదురు గా దిగి..అక్కడ నుంచీ కారులో రఘు కాలేజీ లో నెల్లిమర్ల ఎమ్మెల్యే కొడుకు పెళ్లి కి హాజరవుతారు.మళ్లీ అరగంటలో ఆ విధంగా నే తిరిగి రాత్రి ఆరు గంటలకు విజయవాడ చేరుకుని..ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో జరగనున్న పెళ్లికి సీఎం జగన్ హాజరవుతారు.
కాగా సీఎం జగన్ రాక ,పర్యటన సందర్భంగా విశాఖ జిల్లా ,నగర పోలీసులు బందోబస్తు లో నిమగ్నమయ్యారు. అలాగే పక్కనే ఉన్న విజయనగరం జిల్లా పోలీస్ శాఖ కూడా డెంకాడ మండల ప్రాంతంలో బందోబస్తు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీపికా…. కలెక్టర్ సూర్య కుమారితో సమావేశమయ్యారు కూడా. దీంతో రమారమి 50 మంది వరకు పోలీసులు బందోబస్తు లో ఉంటారు.