33.2 C
Hyderabad
May 15, 2024 13: 56 PM
Slider ప్రత్యేకం

బిసి ముఖ్యమంత్రి కావాలి: జగన్ బావ అనిల్ నినాదం

#brotheranil

రాష్ట్రానికి బిసి వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ బావ, వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన క్రైస్తవులు, బీసీలు, మైనారిటీల ఆకాంక్షలు మూడు సంవత్సరాల జగన్ పాలనలో తీరలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

క్రైస్తవ సంఘాలు, బీసీ, మైనారిటీలకు చెందిన వ్యక్తులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి తనను పిలిచారని, వారి బాధలు వినేందుకు తాను వచ్చానని బ్రదర్ అనిల్ తెలిపారు. ఒక్క అవకాశం అంటే తాము అన్ని పార్టీలనూ వదిలి జగన్ కు మద్దతు తెలిపామని తనను కలిసిన వారు చెప్పినట్లు అనిల్ వివరించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోలేదని వారంతా తనకు తెలిపారని బ్రదర్ అనిల్ అన్నారు.

ఎన్నికలలో జగన్ కు సపోర్టు చేస్తే వారి సమస్యలు తీరుస్తానని తాను హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. దేవుడిని నమ్మే తాను అసత్యాలు మాట్లాడలేనని, తాను ఇచ్చిన మాట చెల్లుబాటు కానందున ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నట్లు బ్రదర్ అనిల్ తెలిపారు. వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానని వినకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 70 స్థానాలలో బ్రదర్ అనిల్ ప్రభావం వల్ల, ఆయన ఇచ్చిన మాట వల్ల తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశామని బ్రదర్ అనిల్ తో సమావేశం అయిన వారు చెప్పారు. బ్రదర్ అనిల్ మద్దతు లేకపోతే 70 స్థానాలలో ఈ ఫలితాలు వచ్చేవి కాదని వారన్నారు.  

Related posts

తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు బంద్

Satyam NEWS

మహాయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

Bhavani

ప్రపంచాన్ని మళ్లీ చుట్టుముడుతున్న ఆర్ధిక మాంద్యం

Satyam NEWS

Leave a Comment