28.7 C
Hyderabad
May 6, 2024 08: 58 AM
Slider నల్గొండ

సిమెంట్ రోడ్డు పనులను శంకుస్థాపన

#ccroad

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 10వ,వార్డులో రామాలయం నుండి కనకదుర్గమ్మ వీధిలో నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి నిధులు నుండి కాంగ్రెస్ వార్డు ఇంచార్జ్ బాచిమంచి గిరిబాబు సహకారంతో మంజూరు అయిన 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు పనులను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు మాట్లాడుతూ హుజుర్ నగర్ నియోజకవర్గం పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హయం లోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అభివృద్ధిని గాలికి వదిలారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పార్లమెంట్ నిధులతో నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు,డ్రైనేజ్ తో పాటు 6 కోట్ల రూపాయలతో సెంట్రల్ సోషల్ రెస్పాన్సబులిటి  నిధులతో అంగన్వాడీ భవనాలు,స్మశాన వాటిక ప్రహరి గోడలు, అభివృద్ధి పనులకు కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కాస్తల శ్రవణ్ కుమార్, కౌన్సిలర్స్ తేజవత్ రాజ నాయక్,కోతి సంపత్ రెడ్డి,వార్డు సభ్యులు సత్యనారాయణ రెడ్డి,వెంకటరెడ్డి,వేముల వెంకన్న,నారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఆసుపత్రుల్లో సౌకర్యాల కోసం కాంగ్రెస్ యాత్ర

Satyam NEWS

హుజూర్‌నగర్‌లో అడిషనల్ డిస్ట్రిక్ట్  సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు

Murali Krishna

భారత్ క్షిపణి ప్రయోగాలపై దుష్ట చైనా నిఘా

Satyam NEWS

Leave a Comment