మహా శివరాత్రి తిరునాళ్ళు సందర్భంగా అత్తిరాల లో కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి వారి రధోత్సవం వేడుకగా నిర్వహించారు. కడప జిల్లాలో జరిగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ఆదివారం రాజంపేట మండలం హత్యరాలలో స్వామివారి రధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వివిధ పుష్పాలతో, స్వర్ణాభరాణాల తో అలంకరించిన శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి వార్లను రథంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. రధోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. మూడు రోజులు గా జరిగిన ఈ తిరున్నాళ్ల కి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో హత్యరాల మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్, చైర్మన్ పూల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.