అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజక వర్గం రాయచోటి ఘాట్ వద్ధ ఉన్న శ్రీ రంగరాజుపాలెం గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి బుధవారం భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర టీడీపీ నేతలు ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర కార్యక్రమం రాజంపేట నియోజకవర్గంలో చేపట్టినారు.
ఆలయంలో పూజల అనంతరం టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర మొదలుపెట్టారు.యువత పెద్ద సంఖ్యలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.శాసన మండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్,లక్కిరెడ్డి పల్లె మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి,చమర్ధి జగన్మోహన్ రాజు, జి.యన్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.తెలుగు దేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోటాపోటీ నినాదాలు
రాజంపేటలో టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర లో గందరగోళం నెలకొంది.ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు టీడీపీ నేత చమర్ధి జగన్మోహన్ రాజు వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేశారు.జై భత్యాల,జై జగన్మోహన్ రాజు అంటూ నినాదాలు చేశారు.
కాగా బస్సు యాత్ర సందర్భంగా స్వాగతం పలుకుతూ జగన్మోహన్ రాజు వర్గీయుల ఏర్పాటు చేసిన దాదాపు 26 ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసారు.ఇరు వర్గాల ఉద్రిక్తతల మధ్య రథయాత్ర కొనసాగింది.ఈ యాత్ర సందర్భంగా రాయచోటి-రాజంపేట రోడ్డు లో స్తంభించిన ట్రాఫిక్ నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పడినారు.