రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ తప్పుడు పనులకు, రాజకీయ వ్యవహారాలకు పనిచేయడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. వాలంటీర్లు అంటే ప్రభుత్వ సొమ్ముతో జీతం తీసుకుంటున్నారు…ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ…రాజకీయ పార్టీకి ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.
ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్లు ఎలా సేకరిస్తారని…దీన్ని సహించేది లేదు అన్నారు. ప్రతి వ్యక్తి వ్యక్తిగత సమాచారం వాలంటీర్లు సేకరించడం, దాన్ని రాజకీయ పక్షాలతో పంచుకోవడం అత్యంత ప్రమాదకరం అని చంద్రబాబు నాయుడు అన్నారు. వాలంటీర్ల సేవలను గౌరవిస్తాం…..కానీ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తాం, ప్రజలపై నిఘా పెడతాం అంటే సహించబోమని అన్నారు.