కరోనా టీకాలు వేయించుకోని 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న టీనేజర్లను పాఠశాలల్లోకి అనుమతించేది లేదని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. గత పక్షం రోజులుగా కరోనా కేసులు భారీగా పెరగడంతో హర్యానా రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ వారికి టీకాలు వేయించాలని మంత్రి కోరారు. పాఠశాలలు తెరిచినప్పుడు, టీకాలు వేయని వారిని పాఠశాలలోకి అనుమతించేది లేదని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. హర్యానాలో 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 15 లక్షల మంది ఉన్నారు. ఈ వయస్సు వారికి కరోనా టీకాలు వేయడం జనవరి 3 నుండి ప్రారంభించారు.
previous post