నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని సంతపేట లోని సెంట్ జోసెఫ్ ఆర్.సి. యం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి రంగారెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, బాల ప్రసాద్, కాయల సురేష్ బాబు, ఆనంద్ బాబు, దార్ల వెంకటేశ్వర్లు, వందవాసి రంగా, గందం సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.