30.2 C
Hyderabad
February 9, 2025 20: 43 PM
Slider ముఖ్యంశాలు

మంత్రి కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం

women-safety-apps

హైదరాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. కళాశాలలోని ప్రయోగశాలలో ఓ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారానికి తెగబడ్డాడు. పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవల్లికి చెందిన మల్లకంటి వెంకటయ్య తార్నాకలో ఉంటూ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.

సోమవారం సాయంత్రం ప్రయోగం కోసమంటూ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిచిన వెంకటయ్య తలుపులు మూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే రోజు బాధితురాలు తనపై జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.

Related posts

సైబర్ నేరాలపై నాగర్ కర్నూల్ లో అవగాహన

Satyam NEWS

కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి అజ్ఞాత భక్తుడి విరాళం రూ.7 కోట్లు

Satyam NEWS

ఆగని అల్లర్లు: మణిపూర్ అసలు చరిత్ర ఇది

Satyam NEWS

Leave a Comment