మలయాళం ఫిల్మ్ మేకర్ సనల్ కుమార్ శశిధరన్ ను కేరళ పోలీసులు ఈరోజు తిరువనంతపురంలో అరెస్ట్ చేశారు. అతనిపై ఐపిసి సెక్షన్ 354 డి (స్టాకింగ్) కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మలయాళ నటి మంజు వారియర్ ఫిర్యాదు మేరకు శశిధరన్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అతను గత కొద్ది రోజులుగా తన వెంటపడుతూ వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఇమెయిల్, సోషల్ మీడియా, ఫోన్ మొదలైన వాటి ద్వారా మంజుకు ప్రపోజ్ చేయడానికి అతను తీవ్రంగా ప్రయత్నించాడు. తనపై పోస్టులు పెట్టవద్దని మంజు కోరినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయినా ఆగకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019 నుండి తనను వేధిస్తున్నాడని చిత్రనిర్మాతపై ఆ హీరోయిన్ ఫిర్యాదు చేసింది.