సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి లక్ష్మీనృసింహ మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నూతన భవన నిర్మాణ కొరకు సోమవారం స్థలశుద్ధి వేద స్మార్త పండితుల పవిత్ర మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ,రక్షాబంధనం,నవగ్రహ ఆరాధన, పంచలోక పాలక పూజ,భూత పారాయణతో స్థల శుద్ధి, నవగ్రహ హోమం శ్రీ లక్ష్మీనరసింహ మూలమంత్ర హవనం, సుదర్శన హవనం వేదమూర్తులు తేజోమూర్తుల రవిశర్మ, శ్రీ లక్ష్మీనరసింహ వేద,స్మార్త పాఠశాల అధ్యాపకులు చీమలపాటి ఫణి శర్మ నిర్వహణలో జరిగింది.అనంతరం పూర్ణాహుతి నీరాజన మహా మంత్రపుష్పం నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి నరసింహ బ్రాహ్మణ నిత్యాన దాన సత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి చెన్నూరి మట్టపల్లి రావు, కోశాధికారి బాచిమంచి గిరిబాబు, ఉపాధ్యక్షుడు నారపరాజు పురుషోత్తమరావు,కమిటీ సభ్యులు రంగరాజు వాసుదేవరావు, భువనగిరి శ్యాంసుందర్,చెన్నూరి శ్రీకాంత్,పులిజాల శంకర్రావు,హరి లక్ష్మణ కుమార్, బాచిమంచి చంద్రశేఖర్,పరాశరం నరసింహమూర్తి,శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థాన అనువంశిక అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, అద్దేపల్లి భూషణ మంగాచార్యులు, సివిల్ ఇంజనీర్ జె.రవీందర్,వేద,స్మార్త పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్