రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు ,హత్యలు జరిగి రాష్ట్రం కాస్త నేరాంధ్ర ప్రదేశ్ గా మారిందని అటు ప్రతి పక్షం..మరో వైపు ప్రజా సంఘాలు ఆందోళన చెందడంతో ప్రభుత్వం త్వరితగతిన దోషులను పట్టుకునే యత్నాలు ప్రారంభించింది.
ఈ క్రమంలో నే రాష్ట్రంలో ఈ నెల 2 విజయనగరం జిల్లా కేంద్రం.. ఉడాకాలనీలో ఓ వివాహిత అత్యాచారం జరిగిన ఘటనలో మిగిలిన ముగ్గురు నిందుతులను దిశ పోలీసులు అరెస్టు చేసారు.
ఈ సందర్భంగా దిశ పీఎస్ లో మీడియా ముందు నిందితులను డీఎస్పీ త్రినాథ్ ప్రవేశ పెట్టారు. దారుణం జరిగిన రోజే స్వయంగా ఎస్పీ దీపిక…దిశ పోలీసు స్టేషన్ లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు తో ప్రధాన ముద్దాయి నాలుగు గంటల పాటు విచారించారు.
అప్పుడే ప్రధాన నిందితుడిని అదుపులో తీసుకున్న దిశ పోలీసులు… అటు ఎస్పి ఆదేశాలు, ఇటు దిశ డీఎస్పీ త్రినాథ్ సూచనలతో సీఐ శేషు,..తన బృందంంతో మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు.ఇదే విషయాన్ని దిశ డీఎస్పీ త్రినాథ్ మీడియా కు తెలియజేసారు.