విశాఖ నగరంలో మరో సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ ఉద్యోగి పాకిస్థాన్ హనీ ట్రాప్ వలలో చిక్కుకున్నాడు. కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ తో విశాఖ సీఐఎస్ఎఫ్ వింగ్ అప్రమత్తమైంది. దీంతో కపిల్ కుమార్ జగదీష్ అనే కానిస్టేబుల్ ను సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకున్నది.
ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విశాఖ సిఐఎస్ఎఫ్ యూనిట్ స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు అందచేసింది. కపిల్ కుమార్ జగదీష్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గోప్యంగా విచారణ సాగుతున్నది.