ఖమ్మం జిల్లా,కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క సందర్శించారు. విద్యాలయంలో మృతి చెందిన 12 వ తరగతి(ఇంటర్) హాలయత్ దుర్గా నాగేందర్ చిత్రపటానికి నివాళలర్పించారు.
అలాగే గాయపడిన ఈశ్వర్,శ్రీ కుమార్ ల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరు మీద విచారణ అధికారి రీజినల్ అసిస్టెంట్ కమిషనర్ ని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కటుంబానికి ఎక్స్ గ్రేసియా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విచారణ అధికారిని కోరారు.
విద్యాలయం లో విద్యార్థుల తో మాట్లాడి వసతుల గురుంచి అడిగి తెలుసుకున్నారు. అధ్యాపక బృందంతో మాట్లాడి తరగుతుల వివరాలు తెలుసుకున్నారు.విద్యాలయం మొత్తం తిరిగి పరిశీలించారు.