సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నేరేడుచర్ల మండల పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 11 మంది లబ్ధిదారులకు 4,58,500 రూపాయల చెక్కులను నేరేడుచర్ల MPP లకుమళ్ళ జ్యోతి భిక్షం, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, మండల పార్టి అధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CM రిలీఫ్ ఫండ్ గొప్ప వరం అని, పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటలో చికిత్స పొంది ఆర్ధికంగా నష్టపోకుండా ఆదుకోవడం కోసం సిఎం సహాయనిధి ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో MPDO ఉపేంద్రా రెడ్డి, నేరేడుచర్ల మండల ప్రధాన కార్యదర్శి & పెంచికల్ దిన్న MPTC యళ్లబోయిన లింగయ్య యాదవ్, తెరాస మండల ఉపాధ్యక్షుడు సుదర్శన్ ,MPTC మధురవాణి , కల్లూరు సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, తెరాస నాయకులు వాడపల్లి నాగేష్, ఎద్దు రంగయ్య, వినోద్, మహేష్,వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.