హుజూర్ నగర్ నియోజకవర్గ పివి రావు మాల మహానాడు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం కోల్లపూడి యోహాన్ అధ్యక్షతన బుధవారం జరిగింది.
ఈ సమావేశంలో పీవీ రావు మాల మహానాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతుల జ్ఞానయ్య, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మిమల్ల నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కోటేశ్వరరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాలే రామారావు, రాష్ట్ర కార్యదర్శి గొట్టుముక్కల రాములు,
సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సూదుల రాములు, జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షురాలు శీలం స్వరూప, పాల్గొని మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై మాలలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏసు మల్ల రాములు, ఎర్ర గోపయ్య, మామిడి వీరస్వామి, మామిడి నితిన్, పోత బత్తిని శ్రీనివాస్, ఎర్రమల శాంతమ్మ, బత్తుల సాయమ్మ, లక్ష్మి, కలమ్మ, నాగలక్ష్మి, కందుల రాయిరాల లింగయ్య, కందుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.