27.7 C
Hyderabad
April 26, 2024 05: 53 AM
నిజామాబాద్

సమస్యల వలయంలో ఉపాధి హామీ కార్యాలయం

#Government Office

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయం సమస్యలకు నిలయంగా మారింది. కనీస మౌలిక సౌకర్యాలు కూడా కార్యాలయంలో లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరుగుదొడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.

అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించి మరీ బిల్లులు చెల్లింపు చేసే అధికారులకు మరుగుదొడ్డి లేకుండా పోవడం కొసమెరుపు. త్రాగే నీటి పరిస్థితి అంతే దాహం వేసినా ఇంకేదైనా అత్యవసరం ఉన్నా బయటకు వెళ్లాల్సిందే.

 దీనిపై సంబంధిత అధికారులు స్పందించి ఉపాధి కార్యాలయంలో మౌలిక  సౌకర్యాలు కల్పించి ఉద్యోగుల సమస్యను తీర్చాలని ఉపాధి అధికారులు కోరుతున్నారు.

Related posts

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

Satyam NEWS

కామారెడ్డిలో విచిత్ర మాస్టర్ ప్లాన్

Bhavani

మంత్రి వేముల సమక్షంలో బిజెపి నుండి టిఆర్ఎస్ లో చేరిక

Bhavani

Leave a Comment