46వ జాతీయ జూనియర్ బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించినందుకు కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు. జనవరి 26 నుండి 31 వరకు రాజంపేట పట్టణం ఇన్ ఫాంట్ జీసస్ హై స్కూల్ లో నిర్వహించారు. టోర్నమెంటును సక్సెస్ ఫుల్ గా జరిపించేందుకు సహకరించిన కడప జిల్లా కలెక్టర్ తో ఈ కమిటీ సభ్యులు నేడు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్, రాజంపేట ఎమ్మెల్యే కలెక్టర్ ని సన్మానించారు. టోర్నమెంట్ చైర్మన్ గా జిల్లా కలెక్టర్, ఆర్గనైజేషన్ కంట్రోల్ ప్రెసిడెంట్ గా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, ఆర్గనైజేషన్ కమిటీ సెక్రటరీగా పోలా శ్రీనివాసులు, కమిటీ కన్వీనర్ రాజంపేట ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి, డిస్టిక్ వాలీబాల్ సెక్రెటరీ షామీర్ భాషా తదితరులు పాల్గొన్నారు.