ఒంటిమిట్ట మండలం లోని చింత రాజు పల్లి లో పలు సంక్షేమ కార్యక్రమాలను రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి అమలు చేశారు. నిరుపేదలైన లబ్ధిదారులకు ఆయన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఇళ్ల స్థలాలకు సంబంధించి లాటరీ తీశారు. లాటరీలో వచ్చిన ఫలితాల ప్రకారం స్థలాలను కేటాయించారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఎమ్మార్వో ఒంటిమిట్ట వేణుగోపాల్ రెడ్డి , ఒంటిమిట్ట మండల హాస్పిటల్ కమిటీ మాజీ ఛైర్మన్ గడ్డం జనార్ధన్ రెడ్డి, సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ ఏ కుల రాజేశ్వరి, ఒంటిమిట్ట కిషోర్ రెడ్డి, రమణ,గడ్డం నాగేశ్వర్ రెడ్డి, హస్త వరం ఉమా మహేశ్వర్ రెడ్డి ,నరసింహా రెడ్డి, బ్యాంకు శివారెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ పుల్లా రెడ్డి,ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.