29.7 C
Hyderabad
May 4, 2024 05: 18 AM
Slider అనంతపురం

మృతి చెందిన కానిస్టేబుల్ కుమారుడికి కారుణ్య నియామకం

#deceased

మృతి చెందిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ కొడుకుకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంటు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నేడు అందచేశారు. వేగవంతంగా ఈ ప్రక్రియ పూర్తి చేయించి ఉద్యోగం ఇవ్వడం పట్ల పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. జిల్లా పోలీస్ ఏ.ఆర్ విభాగంలో ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఈ ఏడాది జూన్ 26 వ తేదీన టి.నబీరసూల్ మృతి చెందాడు.

దాంతో ఆయన కుమారుడు మన్సూర్ బాషాకు కారుణ్య నియామకం కింద జిల్లా పోలీసు శాఖలో జూనియర్ అసిస్టెంటుగా నియమిస్తూ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నియామక ఉత్తర్వులు అందజేశారు.

కుటుంబ పెద్దను కోల్పోయి ఐదు నెలలు కూడా గడవకనే మృతుడి కొడుకుకు కారుణ్య నియామకం కింద జిల్లా ఎస్పీ జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం ఇవ్వడం పట్ల జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్ తదితరులు ఉన్నారు.

Related posts

రైతుల ఉసురు పోసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు

Satyam NEWS

రామంతపూర్ వార్డ్ ఆఫీస్ లో దీపావళి సబరాలు

Satyam NEWS

మా వూళ్లో మద్యం వ్యాపారులకు కరోనా రాదు

Satyam NEWS

Leave a Comment