41.2 C
Hyderabad
May 4, 2024 17: 33 PM
Slider హైదరాబాద్

అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆక్రమణదారులు

#Sherilingampally MLA

హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని వారు ఆరోపణలు చేస్తున్నారని కాలనీ వాసులు అంటున్నారు. హైదర్ నగర్ కిందికుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనుల విషయంలో నాలుగు రోజుల క్రితం రెవెన్యూ సిబ్బందికి ప్రజలకు జరిగిన వాదోపవాదనల విషయంలో ఒక ఛానల్ మరియు సోషల్ మీడియా లో ప్రచారమవుతున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామని వారన్నారు.

ఇందులో ఏ మాత్రం నిజం లేకపోగా అవాస్తవాలు తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని వారన్నారు. చెరువును అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో కొందరికి (ఖబ్జా రాయుళ్లు) ఆటంకం ఏర్పడడంతో కొన్ని రాజకీయ శక్తులతో చేతులు కలిపి ఎమ్మెల్యే వ్యక్తిగతః ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారని కాలనీ వాసులు అంటున్నారు.

 నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురై శిధిలావస్థలో ఉండి , డ్రైనేజి వ్యవస్థ విచ్చిన్నకరంగా మారి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో ప్రజల అభ్యర్ధనల మేరకు సొంత నిధులు వెచ్చించి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వారు తెలిపారు.

కొన్ని రాజకీయ శక్తులను , కబ్జా రాయుళ్లను అడ్డుకొని అడ్డుకట్ట వేయడం భరించలేనిదిగా మారిందని, అసత్య ఆరోపణలతో అధికారులను తప్పుద్రోవ పట్టించి పనులకు ఆటంకం కలుగజేయడానికి పూనుకున్నారని వారు తెలిపారు.

Related posts

నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

ఏ విలువలకీ ప్రస్థానం?

Bhavani

బలవంతపు భూ సేకరణ తగదు

Bhavani

Leave a Comment