ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన తరుణంలో నరసరావుపేట పోలీసులు ముందుండి ప్రజలను కట్టడి చేయడంలో వారి కృషి ఎనలేనిది చెప్పాలి. రాత్రి, పగలు ఎండనక వాననక కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల కోసం శ్రమించారనడంలో అతిశయోక్తి కాదు. ఫ్రంట్ లైన్ లో ఉన్న పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు ఉన్నారు.
వీరందరూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. ఇందులో భాగంగా పోలీసు శాఖ COVID 19 లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారులను ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రివార్డులు అందజేశారు. వారిలో ఎస్సై బ్రహ్మం కూడా ఉన్నారు.
నరసరావుపేట పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఎస్సై బ్రహ్మం కు జిల్లా పోలీస్ బాస్, ఎస్పీ విజయరావు ప్రత్యేకంగా అభినందించారు. నరసరావుపేట ప్రాంతంలో కరోనా కట్టడికి సమర్థవంతంగా విధులు నిర్వహించిన బ్రహ్మం ను గుర్తించి ఆయనకు రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఎస్సై బ్రహ్మం కు అభినందనలు తెలియజేశారు.