26.7 C
Hyderabad
May 16, 2024 10: 56 AM
Slider జాతీయం

కాంగ్రెస్ నేత అహ్మ‌ద్ ప‌టేల్ క‌న్నుమూత‌

ahmed patel

కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు.

కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు. అహ్మద్​ పటేల్​ తాను కరోనా బారిన పడినట్లు అక్టోబర్​ 1న ట్విటర్​ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్​ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అహ్మద్​ పటేల్ తుదిశ్వాస విడిచారు.

Related posts

బయ్ఇట్ :అమ్మకానికి మాల్యా విలాసవంతమైన భవనం

Satyam NEWS

బాలాజీ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

వైయస్సార్ కు ఏలూరులో ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment