28.7 C
Hyderabad
April 27, 2024 06: 00 AM
Slider రంగారెడ్డి

బాలాజీ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ

#BalajiTrust

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని లింగసానిపల్లి  గ్రామంలో కరోనా సోకిన బాధితులకు బుధవారం బాలాజీ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

లింగసానిపల్లి గ్రామంలో కరోనా బారినపడిన మూడు బాధిత కుటుంబాలకు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, బాలాజీ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాలాజీ సింగ్ మాట్లాడుతూ  బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయాలి కాగా కరోనా బారినపడిన బాధితుల కుటుంబాల పేర్లు, వారి చిత్రాలు, వాడరాదని సూచించారు.

అదేవిధంగా ప్రపంచం లోని అన్ని దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అని ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ లు విధిగా వాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  కల్వకుర్తి ఎం పి పి సునీత, కూర్మయ్య గ్రామ సర్పంచ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి

Satyam NEWS

జర్నలిస్టులపై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Satyam NEWS

విజయసాయిరెడ్డిపై 100 కోట్ల పరువు నష్టం దావా

Satyam NEWS

Leave a Comment