వినియోగదారుల చట్టాలపైనా వినియోగదారులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. నేడు హనుమకొండలోని స్వధార్ మహిళల ఆశ్రమంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఏదైనా వస్తువు కొన్నప్పుడు బిల్లు, గారెంటి, వారెంట్ కార్డు లు తీసుకోవాలని ఆమె సూచించారు. చట్టం పై అవగాహన అవసరం అని అప్పుడే వాటిని వినియోగించు కోగలుగుతారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్వధార్ ఇంచార్జ్ శైలజ, మహిళలు పాల్గొన్నారు.
previous post