తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. సీఎస్ సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది. 16 మందిని సూపర్ సీడ్ చేసి ఆయనను తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపి వేసి క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో తెలంగాణలో ఆయన కొనసాగుతున్నారు.
క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేశారు.