28.2 C
Hyderabad
May 9, 2024 02: 51 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ నడిబొడ్డున తాగునీటి సమస్య తీవ్రం

#BJPAmberpet

తాగు నీటి సమస్య పై హైదరాబాద్ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ మహేష్ కుమార్ కి బాగ్ అంబర్ పెట్  డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి నేడు వినతి పత్రం సమర్పించారు.

బతుకమ్మ కుంట, సాయి మధుర నగర్, కురుమ బస్తీ, ధోబి గల్లి, అంబర్పేట్ మహంకాళి అమ్మ గుడి ప్రాంతం, బురుజు గల్లీలలో తక్కువ వత్తిడి తో నీరు సరఫరా అవుతున్నదని ఆమె తెలిపారు.

చాలినన్ని మంచినీళ్లు అందని సమస్య కొన్ని బస్తీలను పట్టి పీడిస్తుంటే మరో వైపు కలుషిత మంచినీటి సరఫరా జరుగుతున్నదని ఆమె అన్నారు.

ఈ సమస్యలపై వినతి పత్రం సమర్పించి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ బిజెపి మాజీ అధ్యక్షుడు వెంక రెడ్డి, సెంట్రల్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షలు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శులు కోడూరి సురేష్, జమ్మి చెట్టు బాలరాజ్, శ్రీహరి,  రమేష్ పాల్గొన్నారు.

Related posts

మే 6న వరంగల్ లో రాహుల్ గాంధీ కిసాన్ పోరాట సభ

Satyam NEWS

జగన్ ను మహావిష్ణువుతో పోల్చినా బిజెపి మాట్లాడదా?

Satyam NEWS

జస్టిస్ కనగరాజ్ నియామకంపై హై కోర్టులో పిల్

Satyam NEWS

Leave a Comment