గ్యాస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గ్యాస్ ఏజెన్సీలు శక్తివంచన లేకుండా కృషి కొనసాగించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ పారిశ్రామిక వాడలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ని ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వరకు భారత్ గ్యాస్ ఏజెన్సీ సేవలు వినియోగదారులకు దూరంగా ఉండేవని ఇప్పుడు కుషాయిగూడ పారిశ్రామికవాడలో నూతన ఏజెన్సీనీ తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ నిర్వాహకులు మల్లారెడ్డి ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనుముల నరసింహారెడ్డి, జర్నలిస్ట్ నాయకులు మోతే వెంక రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులు నాయకులు ఎంపల్లి పద్మా రెడ్డి, కొండూరి మురళి పంతులు, మొగిలి రాఘవరెడ్డి, బుచ్చి రెడ్డి, కొండా రెడ్డి, రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి