నెల్లూరు జిల్లా రైస్ కాన్వాసింగ్ ఏజెన్సీ అసోసియేషన్, రోటరీ క్లబ్ సౌత్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని నెల్లూరు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.వెంకట రత్నం ప్రారంభించారు.
13 వ రోజు నెల్లూరు జిల్లా రైస్ కాన్వాసింగ్ ఏజెన్సీ అసోసియేషన్ అధ్యక్షులు శేగు షణ్ముగరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
గురువారం నాడు దాతలుగా శ్రీరామ్ సతీష్, తిరుమల కళ్యాణి, వెంకట నాగ సాయి, మయూరి ఉన్నారు. మజ్జిగ చలివేంద్రం విజయవంతంగా నిర్వహించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.