లాక్ డౌన్ తర్వాత ఇటీవలె తెరచుకున్న కియా మోటార్స్ కు ఇప్పుడు కరోనా సెగ తగిలింది. అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ లోని బాడీ షాప్ లో విధులు ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ రావడంతో కియా మోటార్స్ సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.
తమిళనాడుకు చెందిన ఆ వ్యక్తి ఈ నెల 25న కర్మాగారానికి వచ్చాడు. అతనికి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడిని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ప్రాంగణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అధికారులు అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.