ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో గతంలో రూ.2 కొట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. ఆయా నిధులతో అనేక పనులు, డొంక రోడ్లు ఎర్పాటు చేసుకోవడం జరిగింది. మండలంలో మిగిలి ఉన్న డొంక రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం మండల రైతుల అభ్యర్థన మేరకు స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపించి ట్రాన్స్ కొ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ.2.40 కోట్లు మంజురు చేయించారు. ఆయా విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ గౌతమ్ గారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు మంజూరైన ఆయా నిధులు మండలంలోని అభివృద్ధి పనులకు వినియోగించాలని సూచించారు.
previous post
next post