31.2 C
Hyderabad
May 3, 2024 02: 35 AM
Slider ముఖ్యంశాలు

యస్ఐ దంపతుల  ఆత్మహత్య

#si

జనగామ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జనగామ ఎస్సై కాసర్ల శ్రీనివాస్‌ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్‌ భార్య స్వరూప(45) ఉదయం ఇంట్లోని బాత్ రూములో ఉరి వేసుకుని చనిపోయారు. అది చూసి శ్రీనివాస్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే భార్య చనిపోయిందన్న మనస్థాపం తో కాసేపటికే శ్రీనివాస్‌ సైతం ఇంట్లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదం జరిగినట్టు చెపుతున్నారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కొన్ని నెలల క్రితమే పెద్ద కుమారుడికి వివాహం జరిపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఇళ్ల లో సీబీఐ తనిఖీలు

Satyam NEWS

కేసుల్లో చిక్కుతున్న టిడిపి పెద్ద నేతలు

Satyam NEWS

మహిళలకు అన్ని రంగాలలో సమూచిత స్థానం దక్కాలి

Murali Krishna

Leave a Comment