రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పక్కదారి ని పడుతున్నదని కెవిపిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యాదర్శి మనోహర్ విమర్శించారు. ఖమ్మం లో జరిగిన సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం రాబందుల పరం అవుతుందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు దళిత బంధు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతికంగా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి పార్టీలకతీతంగా అందించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే దళితులందరినీ గుర్తించి అందరికీ దళిత బంధు వర్తించేలా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు సాధన కోసం ఈ నెల 17న జరిగే చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భద్రం, జర్రిపోతుల కిరణ్, గొర్రెల మేఘన, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
previous post
next post