టీడీపీ చేసిన విమర్శలు అసంబధ్ధమైనవి:జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చిన్న శీను
విశాఖ గర్జన లో తమ పార్టీ కి చెందిన మంత్రి రోజా ,టీటీడీ చైర్మన్ వైవాహిక సుబ్బారెడ్డి ల పై జనసేన పార్టీ రాళ్ళ దాడికి పాల్లడటం..దారుణమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్యం లో రాళ్ల దాడి చేయడం సహేతుకం గా లేదన్నారు. ఈ మేరకు తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అటు టీడీపీ కూడా జిల్లా ల ఏస్పరేషన్ పై కేంద్ర మాజీ మంత్రి గా ఉండే అశోక్ గజపతిరాజు విమర్శలు చేయడం బాగోలేదన్నారు. పైపెచ్చు విశాఖ లో తమ పార్టీ తలపెట్టిన కాదు.. కాదు.. విశాఖ జేఏసీ తలపెట్టిన గర్జన చూసి ఓర్వలేక.. అటు జనసేన, ఇటు టీడీపీ ఒకవైపు దాడులు మరోవైపు విమర్శలు చేయడం ప్రజాస్వామ్య పధ్ధతి లో సరి కాదన్నారు. ఏదైనా జనసేన పార్టీ గుర్తింపు కోసం.. సాక్షాత్ రాష్ట్ర మంత్రి రోజా కారుపై రాళ్ళ దాడికి పాల్పడటం సరికాదన్నారు.