ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లలో రూ.1.35 కోట్లతో నిర్మించనున్న సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు. ఖమ్మం నగరంలోని 56వ డివిజన్ ద్వారకా నగర్ లో రూ.45 లక్షలు, 51వ డివిజన్ NSP క్యాంపు నందు రూ.45 లక్షలు, 39వ డివిజన్ మెదర బజార్ లో రూ.45 లక్షలు కలిపి మొత్తం రూ.1.35 కోట్లతో నిర్మించనున్న సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం అభివృద్ది లో రాష్ట్రం లోనే అగ్రగామిగా వుందన్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, శీలంశెట్టి రమావీరభద్రం, మడూరి ప్రసాద్, డి ఈ లు స్వరూప రాణి, రంగారావు, సిబ్బంది, డివిజన్ నాయకులు ఉన్నారు.