హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కు పెను ప్రమాదం తప్పింది.
నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుండి నల్లగొండ కు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.
దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది.
కారు స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు దూసుకు పోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం తో భారీ ప్రమాదం తప్పినట్లు అయ్యింది.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవలేదు. కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ నల్లగొండకు బయల్దేరి వెళ్లారు.