ఉరవకొండ మేజర్ పంచాయతీలో డప్పు, చర్మ కళాకారులకు నూతనంగా మంజూరు అయిన ‘వైస్సార్ పింఛన్ కానుక’ను శనివారం సర్పంచ్ మీనుగా లలిత, వైస్సార్సీపీ నాయకులు బసవరాజు,పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్, సచివాలయం-2 కార్యదర్శి యుగంధర్ తదితరులు పంపిణీ చేశారు.
పింఛన్లు మంజూరు అయిన డప్పు కళాకారులు మాట్లాడుతూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మాకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. ముఖ్యమంత్రికి మా డప్పు కళాకారుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
అదేవిధంగా పింఛన్లు వచ్చేందుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి వారు కృతజ్ఞతలు చెప్పారు. వీరితో పాటు ఒక చేనేత పింఛను కూడా లబ్ధిదారునుకి అందజేశారు.మొత్తం 10 మందికి నూతన పింఛన్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.