రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవి క్రమంగా బలపడుతుండడంతో వాటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై బాగా ఉంటుందని వారు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.