ఇంకో వారంలో పెళ్లి జరగబోతున్న ఒక యువతి దారుణంగా హత్యకు గురైంది. కారణం తెలియదు. ఎవరు చేశారో తెలియదు. పాపం. ఆ అమ్మాయి మాత్రం రక్తం ముద్దగా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఈ దారుణం జరిగింది. ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న దివ్య (25) హత్య కు గురి కావడంతో గజ్వేల్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విధులు ముగించుకొని రూమ్ కు చేరుకున్న దివ్యను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మెడ కోసి హత్య చేశారు. మృతురాలు దివ్య స్వగ్రామం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామం. ఈ నెల 26న దివ్య వివాహం జరగాల్సి ఉంది.