బాలివుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ప్రముఖులను బెదిరించి వారి నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసిన సుకేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది.
ప్రముఖుల నుంచి సుకేష్ దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం జాక్వెలిన్ను చాలా కాలం పాటు విచారించింది. దాదాపు 15 గంటల పాటు సాగిన ఈ ఇంటరాగేషన్లో జాక్వెలిన్ చాలా తీవ్రమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
వీటన్నింటి మధ్య, ED తన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో జాక్వెలిన్ కూడా రూ. 200 కోట్ల మనీ ఎక్స్టార్షన్ కేసులో నిందితురాలిగా తేలింది. సుకేష్ నుంచి తాను చాలా ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంగీకరించింది. జాక్వెలిన్తో పాటు, నోహ్ ఫతేహి, నిక్కీ తంబోలితో సహా ఈ కేసులో ఎక్కువ మంది నటీమణులు ఉన్నారు.
ఇద్దరు నటీమణులను కూడా విచారించారు.కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. అతనిపై 10కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈడీ ఈ కేసులో జాక్వెలిన్ను పలు దఫాలుగా విచారిస్తునే ఉన్నది. ఇదే కేసుకు సంబంధించి జాక్వెలిన్ కు వ్యక్తిగత స్టైలిస్ట్ లిపాక్షిని కూడా ఈడీ విచారణ చేసింది. ఈ విచారణలన్నింటి తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్కు మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉందని పేర్కొంది.
ఆ తర్వాత నటికి పాటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. దాంతో జాక్వెలిన్ పాటియాలా హౌస్ కోర్టు ఎదుట హాజరైంది. జాక్వెలిన్ తరఫు న్యాయవాది పాటియాలా హౌస్ కోర్టులో ఆమెకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అదనపు సెషన్స్ జడ్జి శైలేంద్ర మాలిక్ జాక్వెలిన్ బెయిల్ పిటిషన్పై ED నుండి ప్రతిస్పందనను కోరారు. అప్పటి వరకు ఆమె రెగ్యులర్ బెయిల్ కోర్టులో పెండింగ్లో ఉంది. జాక్వెలిన్ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు, రూ. 50,000 పూచీకత్తుపై జాక్వెలిన్కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.